హైదరాబాద్లో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో 90 శాతం రాయితీని జీహెచ్ఎంసీ ప్రకటించింది. మార్చి 31 వరకు అవకాశం కల్పించిన ఓటీఎస్ పథకం ద్వారా పన్ను చెల్లించి పెనాల్టీ నుంచి ఉపశమనం పొందవచ్చని కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇప్పటివరకు 18 లక్షల మంది పన్ను చెల్లించగా.. త్వరలోనే 'ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక', ఈ-వేస్ట్ డ్రైవ్ చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.