తల్లిదండ్రుల ఆస్తిలో హక్కులు కోరే కుమార్తెలు వారి సంరక్షణ బాధ్యతను కూడా సమానంగా తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు తన కుమారుడి నిర్లక్ష్యంపై దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ బి. విజయ్సేన్ రెడ్డి ఈ విధంగా వ్యాఖ్యనించారు. ఆస్తి వివాదాల్లో పిల్లలను ఇంటి నుంచి గెంటివేయడం చివరి ప్రయత్నం కావాలని.. అలాగే కుమార్తెలు ఆస్తితో పాటు బాధ్యతను పంచుకోవాలని కోర్టు సూచించింది.