తెలంగాణలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు తీపి కబురు. ఇక నుంచి ఇంటర్ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకం అమలు కానుంది. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి.. ఈ పథకంపై కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు వెల్లడించారు.