ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులకు ఇన్స్ట్రక్టర్లు, ఆయాల నియామకాల కోసం ఖమ్మం జిల్లాలో నిర్వహించిన ఇంటర్వ్యూలకు అనూహ్యంగా వందలాది మంది అభ్యర్థులు హాజరయ్యారు. కేవలం 25 పోస్టుల భర్తీకి ఈ స్థాయిలో పోటీ నెలకొనడం తెలంగాణలో నిరుద్యోగ తీవ్రతను తెలియజేస్తోంది. అదనపు కలెక్టర్ సూచనల మేరకు ఖమ్మం, కల్లూరు ఆర్డీఓ కార్యాలయాలలో నేడు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉన్నత విద్య పూర్తి చేసిన వారితోపాటు చిన్న పిల్లల తల్లులు సైతం దరఖాస్తులు సమర్పించేందుకు రావటం రాష్ట్రంలో ఉద్యోగావకాశాల కొరతను స్పష్టం చేస్తోంది.