Andhra Pradesh Inter Exams 2026: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్! మార్చి 2026 పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 15 నుంచి అక్టోబర్ 10 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఆలస్యమైతే రూ.1000 జరిమానాతో అక్టోబర్ 21 వరకు అవకాశం ఉంది. థియరీ, ప్రాక్టికల్స్, బ్రిడ్జి కోర్సులకు వేర్వేరుగా ఫీజులు నిర్ణయించారు. ఫీజు గడువు తర్వాత చెల్లింపులకు అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.