హైదరాబాద్ కాచిగూడ పీఎస్ పరిధిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటి దోషం పేరుతో ఓ నకిలీ స్వామిజీ మహిళా లెక్చరర్ను మోసం చేశాడు. దాదాపు 20 లక్షలతో ఉడాయించాడు. దీంతో బాధితురాలి కుమార్తె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.