పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే లక్ష్యంతో నిమ్స్ ఆసుపత్రి ఆధునీకరణ పనులు వేగవంతమయ్యాయి. అత్యాధునిక పరికరాలు, ఏఐ అనుసంధానం, నిమ్స్ యాప్ ద్వారా సేవలు మెరుగుపడ్డాయి. ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుతో ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారు. అవయవ మార్పిడి చికిత్సల్లో నిమ్స్ అగ్రస్థానంలో నిలిచింది.