పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో కరాచీ బేకరీల యాజామన్యం ఆందోళన చెందుతోంది. విశాఖపట్నంలో ఒక బేకరీపై దాడి జరగడంతో.. హైదరాబాద్లోని కరాచీ బేకరీల యజమనాలు అప్రమత్తమయ్యారు. తాము వంద శాతం భారతీయులమేనని.. దేశ విభజన తర్వాత 1953లోనే ఇక్కడ బేకరీలు ఏర్పాటు చేసినట్లు ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేశాయి. కేవలం చరిత్ర ఆధారంగానే కరాచీ అని పేరు పెట్టాల్సి వచ్చిందని చెబుతున్నారు.