పహల్గాం దాడికి ప్రతిస్పందనగా భారత్ 'ఆపరేషన్ సిందూర్' చేపట్టటం, ఆ తర్వాత పాక్ డ్రోన్ల దాడితో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త దందాకు తెరలేపారు. విరాళాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఆర్మీ అధికారులమని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలాంటి నకిలీల పట్ల అప్రమత్తంగా ఉండాలని, విరాళాలు పంపే ముందు నిజానిజాలు తెలుసుకోవాలని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.