తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రానున్న శ్రీరామనవమి తరువాత రాష్ట్ర ప్రజలకు మరో శుభవార్త ఉంటుందని ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలోని ముఖ్యమైన "ఇందిరమ్మ ఇళ్ల" పథకం అమలుపై స్పష్టత ఇచ్చారు. శ్రీరామనవమి తరువాత లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణం ప్రారంభమవుతుందని తెలియజేశారు.