ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. పారదర్శకంగా.. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో అదనంగా ఇండ్లు నిర్మించి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.