ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రేవంత్ ప్రభుత్వం తొలివిడతలో 71 వేల మందికి ఇళ్లు మంజూరు చేసింది. అయితే వీరిలో అనర్హులు ఎక్కువ మంది ఉన్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో మరోసారి రీవెరిఫికేషన్ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇచ్చిన మంజూరు పత్రాలను సైతం వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.