తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కోసం సరికొత్త పరిష్కారాన్ని కనుగొంది! ఇసుక కొరత, అధిక ధరల సమస్యలకు చెక్ పెట్టేందుకు 'సాండ్ బజార్'లను ప్రారంభించింది. మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేటలో దీనిని ప్రారంభించి, లబ్ధిదారులకు సబ్సిడీ ధరకే ఇసుకను అందిస్తామని తెలిపారు. దీనివల్ల లబ్ధిదారులకు వేలల్లో ఆదా అవుతుంది. ఇంతకీ ఈ సాండ్ బజార్ ఎలా పనిచేస్తుంది? లబ్ధిదారులకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది?