ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి, రెండో దశలకు కలిపి 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని సర్కార్ అంచనా వేస్తోంది. ఈ మేరకు ఒక్కో లబ్ధిదారుడికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను నాలుగు విడతల్లో అందించనున్నారు. ఎమ్మార్వో కార్యాలయంలో టోకెన్లు పొంది లబ్ధిదారులే ఇసుకను తరలించుకోవాల్సి ఉంటుంది. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని, పక్క జిల్లాల నుంచి ఇసుక సరఫరాకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.