ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద జర్నలిస్టులకూ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. నాంపల్లి ప్రెస్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్లు ఇస్తామని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. మూతబడిన ప్రెస్ అకాడమీని ఈ నెల చివరి నాటికి తిరిగి ప్రారంభిస్తామని ఆయన హామీ ఇచ్చారు.