తెలంగాణలోని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇండ్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద నిరుపేదల ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందుతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి భూమిలేని చెంచులకు తీపి కబురు చెప్పారు. వారిని ప్రత్యేక కేటగిరి పరిగణించి పది రోజుల్లో ఇండ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. నాగర్కర్నూల్లో ఇందిర సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు.