ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా పేదలు చేపట్టిన ఇంటి నిర్మాణ విస్తీర్ణంపై ఆయా లబ్ధిదారుల్లో అయోమయం నెలకొంది. 400- 600 చదరపు అడుగుల పరిమితిని కొందరు అతిక్రమించడంతో మొదటి విడత బిల్లుల విడుదల నిలిచిపోయింది. గతంలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ఇప్పుడు నిబంధనలు విధించడంపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే, 600 చదరపు అడుగులు దాటితే బీపీఎల్ పరిధి దాటుతారని అధికారులు చెబుతున్నారు.