ఇందిరమ్మ ఇళ్ల పథకం అప్‌డేట్.. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

5 days ago 9
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ పథకం విజయవంతం కావాలంటే జిల్లా కలెక్టర్లదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని, ఉచిత ఇసుక కూపన్లు సకాలంలో అందేలా చూడాలని ఆదేశించారు. కొత్త టెక్నాలజీ వినియోగం, ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్లకు రుణాలు అందించడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. మే 29, 30వ తేదీల్లో ఇంఛార్జ్ మంత్రులు జిల్లా్ల్లో పర్యటించి.. జూన్ 1వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లకు తొలి విడత నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.
Read Entire Article