గృహ నిర్మాణ పథకాలలో కొత్త శకానికి నాంది పలికిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చి 11న ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు, అలాగే పాత ఇళ్లను మరమ్మత్తు చేసుకోవాలనుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈ పథకానికి దరఖాస్తులను కూడా స్వీకరించారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 1,435 కోట్లు లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.15 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నాయి.