తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు సిమెంట్, స్టీల్పై జీఎస్టీ తగ్గింపుతో ఆర్థిక భారం తగ్గనుంది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త ధరలు అమలులోకి రానుండగా, ఒక్కో ఇంటిపై సుమారు రూ. 13 వేల వరకు ఆదా అవుతుంది. అయితే, ఈ ప్రయోజనం లబ్ధిదారులకు చేరేలా ధరల పర్యవేక్షణపై ప్రభుత్వం దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.