తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం శర వేగంగా ముందుకు సాగుతోంది. మొదటి దశలో మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలానే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై ఆర్థికభారం పడకుండా చూడటం కోసం లబ్ధిదారులకు తక్కువ ధరకే ఇసుకను అందించేందుకు ప్రభుత్వం ఇసుక బజార్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా టన్ను ఇసుకను రూ.1200లకే అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..