ఇందిరమ్మ ఇళ్ల గురించి తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్న్యూస్ అందించింది. ఇప్పటికే ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరు చేస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించగా.. తాజాగా కొన్ని నియోజకవర్గాలకు అదనంగా మరిన్ని ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా ఈ ఇందిరమ్మ ఇళ్లలో చెంచుల కోసం ప్రత్యేకంగా 10 వేల ఇళ్లను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. చెంచుల అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన చేసింది.