ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. తొలి దశలో అత్యంత పేదలకు, అర్హులకు మాత్రమే ఇండ్లు మంజూరు చేయాలన్నారు. అనర్హులకు ఇండ్లు కేటాయిస్తే ఆయా ఇండ్లను వెనక్కి తీసుకోవాలన్నారు. ఇక ఇంటి నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్, ఇతర నిర్మాణ సామాగ్రిని తక్కువ ధరకే అందించాలని సూచించారు.