విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం వేడుకగా జరగనుంది. అదే రోజు నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఆగస్టు 16న కృష్ణాష్టమి వేడుకలు, 23న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తారు. అదేవిధంగా తిరుమలలో శ్రీవారి పుష్కరిణికి మరమ్మతులు జూలై 20 నుంచి ఆగస్టు 19 వరకు జరగనున్నాయి.