హైదరాబాద్లో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా ఇకపై దూకుడుగా వ్యవహరించనుంది. ప్రభుత్వ భూములు, చెరువులు ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇసుక అక్రమ రవాణా, నిర్మాణ వ్యర్థాలు వేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపేందుకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయనున్నారు. ఆక్రమణదారులను జైలుకు పంపేందుకు హైడ్రా సిద్దంగా ఉంది.