హైదరాబాద్లో తరచుగా తలెత్తే విద్యుత్ అంతరాయాలు, ప్రమాదాలకు పరిష్కారంగా టీజీఎస్పీడీసీఎల్ భూగర్భ కేబుళ్ల (అండర్గ్రౌండ్ కేబుల్స్) ఏర్పాటుకు సిద్ధమైంది. ఓవర్హెడ్ లైన్ల వల్ల చెట్లు కూలడం, షాక్ల వంటి సమస్యలు తొలగిపోనున్నాయి. ముందుగా ప్రధాన రహదారులపై భూగర్భ కేబుళ్లు వేసి, తర్వాత బస్తీలకు విస్తరిస్తారు. ఇందుకోసం సర్వే బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కొత్త ప్రాజెక్టుతో నగరంలో విద్యుత్ సరఫరా మెరుగుపడి, భద్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు.