Egg Biryani at Telangana Anganwadis: తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఇకపై పిల్లలకు వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఎగ్ బిర్యానీ వడ్డించనున్నారు. అంతేకాకుండా, గర్భిణులు, బాలింతల సౌకర్యార్థం బెంచీలు ఏర్పాటు చేయనున్నారు. అంగన్వాడీ టీచర్లకు కొత్త మొబైల్ ఫోన్లు ఇవ్వనుండగా, బడి గంట తరహాలో బెల్స్ విధానం ప్రవేశపెట్టనున్నారు. త్వరలోనే 14 వేల ఖాళీలను భర్తీ చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. నాసిరకం సరుకులు సరఫరా చేసే వారిని బ్లాక్ లిస్టులో పెడతామని ఆమె హెచ్చరించారు.