తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి తెలంగాణ ప్రజాప్రతినిధులు తమ సిఫార్సు లేఖలను ఆన్లైన్లో జారీ చేసేలా CMO ఓ ప్రత్యేక పోర్టల్ను రూపొందించింది. ఇకపై సిఫార్సు లేఖల్ని పోర్టల్లో నమోదు చేయాల్సిందే అని సీఎంవో స్పష్టం చేసింది. ఈ పోర్టల్ నుంచి భక్తులు, దర్శన వివరాలతో జారీ అయ్యే లేఖలనే టీటీడీ అంగీకరిస్తుందని చెప్పింది. ఈ లేఖలతో సోమవారం నుంచి గురువారం వరకు శ్రీవారి దర్శనాలు కల్పిస్తారని చెప్పారు.