తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. విధుల్లో భాగంగా.. 10 నుంచి 12 గంటల పాటు నిలబడే ఉంటున్న ఫోర్త్ క్లాసు ఉద్యోగులకు ఉపశమనం కల్పించే ప్రకటన చేశారు. సెక్యూరిటీ గార్డులు, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు, పోలీస్ హోంగార్డులకు "సిట్ టు రైట్" కల్పించాలన్న ప్రతిపాదనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ అంశంలో సాధ్యాసాధ్యాలపై చర్చించి.. ఓ మంచి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.