Telangana worker dies in Israel: ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నడుమ, ఉపాధి కోసం ఇజ్రాయెల్ వెళ్లిన జగిత్యాల వాసి రెవెళ్ల రవీందర్ (57) టెల్ అవీవ్ ఆసుపత్రి బంకర్లో చికిత్స పొందుతూ మరణించారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన 20 రోజుల క్రితం ఆసుపత్రిలో చేరారు. రవీందర్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు భారత రాయబార కార్యాలయాన్ని కోరారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎన్నారై కమిటీ వైస్ చైర్మన్ భీమిరెడ్డి సహాయం కోరారు.