ఇటీవల కాలంలో నిర్మాణ ఖర్చులు భారీగా పెరగడంతో పేదలకు ఇల్లు కట్టడం కష్టంగా మారింది. ఇందిరమ్మ పథకంలో ప్రభుత్వం రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నా.. అది సరిపోదని లబ్ధిదారుల ఆందోళనలు ఉన్నాయి. అయితే వేదాన్ ఇన్ఫ్రా టెక్ అనే స్టార్టప్ కంపెనీ షేర్ వెల్ టెక్నాలజీ ఉపయోగించి అల్యూమినియం ఫ్రేమ్ వర్క్, కాంక్రీట్ గోడలతో 15 రోజుల్లోనే 400 ఎస్ఎఫ్టీ ఇల్లు నిర్మించింది. సిమెంట్ ఇటుకల అవసరం లేకుండా రూ. 5 లక్షల బడ్జెట్లోనే మోడల్ హౌస్ నిర్మించింది.