ఇది చాలా ఆందోళన కలిగించే అంశం.. మోదీ సూచన ఫాలో కావాల్సిందే: విజయసాయిరెడ్డి

1 hour ago 2
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో చెప్పిన ఆర్థిక సూత్రాలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన విశ్లేషణ చేశారు. డాలర్‍తో పోలిస్తే రూపాయి విలువ పతనమౌతున్న పరిస్థితులతో జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మోదీ సూచనలు చేశారని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. మోదీ సూచనలు పాటించడం ద్వారా బంగారం, పెట్రోల్, వంటనూనెలు, ఎరువులు, ఇలా మొత్తం 250 బిలియన్ డాలర్ల దిగుమతులను తగ్గించవచ్చన్నారు విజయసాయిరెడ్డి. మనదేశం ఉత్పత్తిని పెంచి.. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సూచించారు.
Read Entire Article