తెలంగాణలో ఎరువుల కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. కేసీఆర్ పాలనలో రాజులుగా బతికిన అన్నదాతలు ఇప్పుడు రోడ్డున పడ్డారన్నారు. ఇది నో స్టాక్ సర్కారు అంటూ ఎద్దేవా చేశారు. డీఏపీ, పొటాష్ కోసం రైతులు భారీ క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని, గతంలోలాగే పోలీస్ స్టేషన్లలో ఎరువులు అమ్మే పరిస్థితి తెచ్చారని దుయ్యబట్టారు.