ఫెమినా మిస్ ఇండియా 2023 విజేత నందిని గుప్తా రామప్ప దేవాలయాన్ని సందర్శించి శిల్పకళా వైభవానికి ముగ్ధురాలయ్యారు. తెలంగాణ టూరిజం శాఖ ప్రత్యేక ఆహ్వానితురాలిగా వచ్చిన ఆమె, ఆలయ శిల్పకళను, సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనియాడారు. 2025 మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుండగా, పర్యాటక రంగానికి ఇది ఊతమిస్తుందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా నందిని తెలంగాణ టూరిజం శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.