Nellore Graves In Middle Of Houses: నెల్లూరు జిల్లా కావలిలో ఇళ్ల మధ్య, చుట్టుపక్కల సమాధులు దర్శనమివ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గ్రామ పెద్దలు కేటాయించిన శ్మశాన వాటిక భూమి ఆక్రమణకు గురికావడంతో ఈ పరిస్థితి నెలకొంది. 50 ఎకరాలకు పైగా ఉన్న శ్మశాన వాటిక స్థలం ప్రస్తుతం అర ఎకరాకు కుదించుకుపోయింది. సమాధులను ఆక్రమించి ఇళ్లు నిర్మించడంతో, కొన్ని సమాధులు పునాదులుగా, గోడల్లో కలిసిపోయాయి. అయినప్పటికీ, కొందరు పెద్దలు పండగ రోజుల్లో సమాధులకు పూజలు చేయడం ఆచారంగా కొనసాగిస్తున్నారు.