ఖమ్మం జిల్లా కూసుమంచి మండల ఎమ్మార్వో కార్యాలయంలో బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఒక కుటుంబానికి అధికారులు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. తప్పును గుర్తించి సరిదిద్దిన సర్టిఫికెట్ ఇవ్వగా.. అందులో కూడా సరైన వివరాలు లేవు. ఇదేంటని ప్రశ్నిస్తే రెవెన్యూ అధికారి దురుసుగా ప్రవర్తించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.