టీడీపీ నేత, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని.. ఆయనపై విచారణ చేయాలంటూ సీబీఐకు కొలికపూడి శ్రీనివాసరావు ఓ లేఖ రాశారు. అయితే ఈ లేఖలో కొలికపూడి శ్రీనివాసరావు పొరబాటు చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కొలికపూడి శ్రీనివాసరావుపై సెటైర్లు వేస్తూ కేశినేని నాని ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కు కొలికపూడి సీబీఐ లెటర్ జత చేశారు.