ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం స్వచ్ఛత కోసం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఇకపై ఇంటిలో పోగయ్యే తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేసి.. పంచాయతీ సిబ్బందికి ఇస్తే చాలు.. వారు మీకు కూరగాయలు, నిత్యావసర సరుకులు ఇస్తారు. త్వరలోనే స్వచ్ఛ రథాలు మీ ఇంటికి వచ్చి చెత్తను తీసుకుంటాయి. గుంటూరులో ఇదివరకే ప్రయోగాత్మకంగా మొదలైంది. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ప్రభుత్వ లక్ష్యం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..