ఇన్‌స్టా ప్రియుడి కోసం తల్లిదండ్రులను చంపిన కూతరు

1 month ago 15
ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నారని.. కన్న తల్లిదండ్రులనే అత్యంత పాశవికంగా.. మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపిందో కూతురు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నారని అందర్ని నమ్మించే ప్రయత్నం చేసింది. చివరకు కటకటాల పాలైంది. ఈ దారుణ సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంట్వారం మండల పరిధిలోని యాచారం గ్రామానికి చెందిన నక్కలి దశరథం, నక్కలి లక్ష్మి దంపతులు రెండ్రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీరి మరణం తొలుత అప్పుల బాధతో చేసుకున్న ఆత్మహత్యగా ప్రచారమైంది. వీరు కొడుకు అశోక్ కూడా తన తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో తనువు చాలించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే.. ఇంట్లో కన్పించిన ఇంజక్షన్లు, కూతురు ప్రవర్తనలో తేడా వల్ల అసలు విషయం బయటపడింది.
Read Entire Article