హైదరాబాద్ శివారు ఘట్కేసర్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన అవినాష్ రెడ్డి అనే యువకుడు ఒక మైనర్ అమ్మాయిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేశాడు. బంగారు ఆభరణాలు తీసుకోవటంతో పాటు చెల్లిని కూడా తీసుకురావాలని వేధించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక ఆ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.