తెలంగాణ రాజకీయాల్లో విమర్శల కంటే ఒకరిపై ఒకరి తిట్ల పురాణాలే ఎక్కువవుతున్నాయి. అయితే.. ఈ తిట్ల పురాణం, వాడుతున్న బాషపై తెలంగాణ అసెంబ్లీలో ప్రస్తావించారు సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో రాజకీయ నేతలు, జర్నలిస్టులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలా తట్టుకుంటున్నారో కానీ.. తమపై చిన్న ఆరోపణ వచ్చినా తట్టుకోలేపోతున్నామని కూనంనేని సాంబశివరావు చెప్పుకొచ్చారు.