ఏపీలో ఇప్పుడు మరోసారి సుగాలి ప్రీతి కేసు.. రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారంలోకి రాకముందు సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మొహం చాటేస్తున్నారని సుగాలి ప్రీతి తల్లి ఆరోపించడం తీవ్ర సంచలనంగా మారింది. అయితే ఈ వ్యవహారంపై స్పందించిన పవన్ కళ్యాణ్.. అసలు సుగాలి ప్రీతి కేసును వెలుగులోకి తీసుకువచ్చింది తామేనని పేర్కొన్నారు. అయినప్పటికీ సుగాలి ప్రీతి తల్లి మాత్రం పవన్ కళ్యాణ్పై ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.