హైదరాబాద్ నగర శివారు ఇబ్రహీంపట్నంలో విషాదకర సంఘటన జరిగింది. ఖమ్మం జిల్లాకు చెందిన 30 ఏళ్ల ఏకలవ్య అనే యువకుడు జ్యూస్ తాగుతుండగా గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా, యువత ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, జీవనశైలి మార్పులు చేసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.