Vijayasai Reddy Another Tweet On Amaravati: కేంద్రం అమరావతికి చట్టబద్ధత కల్పించి రాజధానిగా ఖరారు చేసింది. ఇంతలో వైఎస్సార్సీపీ మావిగన్ పేరుతో కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అమరావతిపై కొన్ని సూచనలు చేశారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాల గురించి ప్రస్తావిస్తూ విజయసాయిరెడ్డి కొన్ని సలహాలు ఇచ్చారు. అలా చేస్తే బావుంటుందని చెప్పుకొచ్చారు.