ఏపీలో ప్రభుత్వ పథకాల కింద ఇళ్ల నిర్మాణం చేపట్టిన వారికి ముఖ్య గమనిక. మార్చి నెలాఖరు నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని గృహనిర్మాణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఉగాది తర్వాత లబ్ధిదారుల పేర్లు ఆన్లైన్లో కనిపించవని.. దీంతో బిల్లులు చెల్లింపులు నిలిచిపోవచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగాది నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచిస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఉగాది రోజున ఐదు లక్షల ఇళ్లల్లో గృహప్రవేశాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.