ఇంటింటికి ఇసుకను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మైనింగ్ శాఖ ఉన్నతాధికారులకు సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీజీఎండీసీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక సరఫరా కోసం హైదరాబాద్ నగర శివారులో 5 శాండ్ (ఇసుక) బజార్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. బ్లాక్ మార్కెట్లో ఇసుక కొనాల్సిన పని లేకుండా.. తక్కువ ధరకే ఇసుక సరఫరా చేసేందుకు సర్కార్ రెడీ అయింది.