Andhra Pradesh PMAY Rs 2.90 Lakhs: ఆంధ్రప్రదేశ్కు కేంద్రం శుభవార్త తెలిపింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి 40,410 ఇళ్లను మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి రూ.2.50 లక్షల వ్యయం కాగా, కేంద్రం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష భరిస్తాయి. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం కింద అదనంగా రూ.39 వేలు అందుతాయి.