తెలంగాణలో అక్రమ నిర్మాణాల తొలగింపు, చెరువుల రక్షణ లక్ష్యంగా ఏర్పడిన హైడ్రా తన ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ హైడ్రా అభివృద్ధికి ప్రతీక అని అన్నారు. గత ఏడాదిలో దాదాపు 500 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించామని, దీని విలువ రూ.30 వేల కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. బతుకమ్మ కుంటను పునరుద్ధరించామని, సెప్టెంబర్ 21న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.