Tirupati District Collector Serious On Pullampet Tahsildar: తిరుపతి జిల్లాలో తహసీల్దారు తీరుపై కలెక్టర్ వెంకటేశ్వర్ సీరియస్ అయ్యారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ భూ సమస్యపై విశ్రాంత సైనికుడు తహసీల్దారుకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. దీంతో ఆయన కలెక్టర్ను కలిశారు.. ఈ క్రమంలో పుల్లంపేట తహసీల్దారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులతోనే నేరుగా అధికారులకు ఫోన్ చేయించగా.. వారు నిర్లక్ష్యపు సమాధానం ఇవ్వడంతో సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు.