ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అలర్ట్.. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.